వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఒక రేంజ్ లో విమర్శలు చేసిన టీడీపీ నాయకురాలు దివ్య వాణి
Admin - November 21, 2020 / 06:45 PM IST
ఏపీ రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగా సాగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఏపీలో ఒక ఉపఎన్నిక జరగాల్సి ఉంది. తిరుపతి ఎంపీ మరణించడంతో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. ఇక ఉపఎన్నిక కోసం వైసీపీ, టీడీపీ పార్టీలు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇదే తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ఆమె మాట్లాడుతూ.. రోజా పదవి కోసం, డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడుతుందని చెప్పుకొచ్చింది. పదవుల కోసం పార్టీలు మారే నీచ బుద్ధి అని ఫైర్ అయ్యింది. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే వ్యక్తిత్వం రోజది అని తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించింది.