ఒక్క దెబ్బకు కెసిఆర్ అబద్దాలన్నీ బయటపెట్టిన బీజేపీ నేత బాబూమోహన్
Admin - December 10, 2020 / 11:26 AM IST
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ కెసిఆర్ అబద్దాలన్నీ బయటపెట్టారు. అయితే గత ఎన్నికల్లో కెసిఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పుకొచ్చాడు. మీడియాతో మాట్లాడిన బాబూమోహన్ ఒక వీడియోను బయటపెట్టారు. వంద శాతం ఎరువులు ఉచితంగా ఇస్తానన్న కెసిఆర్ మాటలు గుర్తుచేశాడు. హామీలన్నీ నెరవేర్చకుండా రైతులకోసం ఉద్యమాలు చేయడం అవసరమా అని ప్రశ్నించాడు. అలాగే ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడిన మాటలకు కౌంటర్ వేసాడు. అసలు ఏం మాట్లాడుతుండో ఎమ్మెల్యేకే అర్ధం కావాలని ఎద్దేవా చేసాడు.