ఇన్నాళ్లుగా అతి కష్టం మీద రాయలసీమలో పట్టు నిలుపుకుంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది. అధికారంలో ఉన్నా లేకున్నా ఇంతకు ముందు సీమలో టీడీపీకి ఒకే రకమైన పరిస్థితులు ఉండేవి. మహా అయితే సింగిల్ నెంబర్లోనే సీట్లు అటు ఇటు అవుతూ వచ్చేవి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా మొదలైనప్పుడు సీమలో టీడీపీకి గడ్డు కాలం ఆరంభమైంది. కాకలు తిరిగిన నేతలను బరిలోకి దింపినా ఓటమే ఎదురయ్యేది. అలా దాదాపు పది పన్నెండేళ్ళు రాయలసీమలో పట్టు పెంచుకోవడానికి అల్లాడిన చంద్రబాబు చివరకి 2014 ఎన్నికలప్పుడు ఏదో కొంత ప్రభావం చూపగలిగారు. కానీ […]