Pawan Kalyan : జనసేనాని పవన్ తిట్ల ప్రవాహం.! నేషనల్ మీడియా వరకూ వెళ్ళిందా.?
NQ Staff - October 19, 2022 / 12:10 PM IST
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నేషనల్ మీడియాలోనూ ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను జనసేనాని చెప్పుతో కొడతానన్నారంటూ నేషనల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్లు మాత్రమే కాదు, ఈ అంశంపై చర్చా కార్యక్రమాలూ నడిచాయి. నిన్న మొన్నటిదాకా అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాల గురించి మెయిన్స్ట్రీమ్ తెలుగు మీడియా కూడా పెద్దగా కవర్ చేసేది కాదు.
పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి వైసీపీ అనుకూల మీడియా, పవన్ కళ్యాణ్ని ఇరికించడానికి టీడీపీ అనుకూల మీడియా ప్రయత్నించేవి అంతే.!
పవన్కి రాజకీయంగా లాభమా.? నష్టమా.? ఓ పార్టీ అధినేత నోరు పారేసుకోకూడదు.! ఇది ప్రాథమిక సూత్రం రాజకీయాల్లో. కానీ, రాజకీయాలు మారాయ్. అత్యంత జుగుప్సాకరంగా తయారయ్యాయ్. సో, ఈ విషయంలో పవన్ కళ్యాణ్కి పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే, ఆయన నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించగలిగారు రాజకీయంగా. తెలుగునాట పవన్ కళ్యాణ్ తప్ప ఇంకో అంశం చర్చకు రాలేదు గత నాలుగైదు రోజులుగా.
మంత్రుల బూతులు నేషనల్ మీడియా వరకూ పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళగలిగారంటే, ఆయన ఆ విషయంలో సక్సెస్ అయినట్లే. ఇది రాజకీయంగా జనసేనకు ఎంత లాభం.? అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చంద్రబాబు భేటీ కారణంగా.. పవన్ కళ్యాణ్కి వచ్చిన మైలేజ్ అంతా ఒక్కసారిగా తుస్సుమందా.? అన్న డౌటానుమానం అయితే జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.