సీఎం కెసిఆర్ రైతులను దోచుకుంటుండు : ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు

Admin - December 20, 2020 / 05:04 PM IST

సీఎం కెసిఆర్ రైతులను దోచుకుంటుండు : ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మీడియాతో అరవింద్ మాట్లాడుతూ… సీఎం కెసిఆర్ తెలంగాణాలో రైతులను దోచుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. రైతులకు సన్నాలు వేయమని చెప్పి కనీసం కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఈ సర్కార్ ఉందని మండిపడ్డారు. కేంద్రం అందుబాటులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో ప్రజలందరికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకొచ్చాడు. అలాగే కొత్త వ్యవసాయ చట్టాలకు కెసిఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో తెలియడం లేదని ఫైర్ అయ్యారు. ఖచ్చితంగా కేంద్ర వ్యవసాయ చట్టాలు అమలు చేయాలనీ, ప్రజలకు మంచి జరగాలంటే ఈ చట్టాలు అవసరమని అరవింద్ పేర్కొన్నారు.

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us