Modi Tweet : ప్రధాని నరేంద్ర మోడీ, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. మరోపక్క, వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి ఓటు వేసినవారికి ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు కూడా.
వాస్తవానికి, ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. ఈ విషయమై ఏపీలోని అధికార వైసీపీ వేస్తున్న సెటైర్లు అన్నీ ఇన్నీ కావు.
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీని గెలిపించిన ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ అధిష్టానానికీ, వైసీపీ అధిష్టానానికీ మధ్య సన్నిహిత సంబంధాలైతే తెరవెనుకాల బలంగానే వున్నాయన్నది నిర్వివాదాంశం.

మోడీ ట్వీటు వెనుక అసలు కోణమేంటి.?
మోడీ ట్వీటులో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి రాజకీయ విశ్లేషకుల నుంచి. తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
కాగా, ఆత్మకూరు ఉప ఎన్నిక విషయమై బీజేపీ అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకుని వుంటే, బీజేపీకి కనీసం డిపాజిట్లు అయినా వచ్చి వుండేవి.
Spoke to Andhra Pradesh CM @ysjagan Garu on the situation in the wake of heavy rainfall in parts of the state. Assured all possible support from the Centre. I pray for everyone’s well-being and safety.
— Narendra Modi (@narendramodi) November 19, 2021