Virender Sehwag : రైలు ప్రమాదంలో చనిపోయిన వారి పిల్లలను ఉచితంగా చదివిస్తా.. సెహ్వాగ్ గొప్ప మనసు..!
NQ Staff - June 5, 2023 / 01:13 PM IST

Virender Sehwag : ఒడిశాలోని బాలసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఏకంగా మూడు రైళ్లు ఢీకొన్న ఘోరమైన ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 275 మంది చనిపోయారు. దాదాపు 950 మందికి పైగా గాయాల పాలు అయ్యారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కాగా ఈ ప్రమాదంపై ఇప్పటికీ రెస్క్యూ టీమ్ కృషి చేస్తోంది.
గాయపడిన వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ మాజీ డ్యాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఓ కీలక ప్రకటన చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి పిల్లలను తానే ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు.
ఆ పిల్లలందరినీ సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఉచితంగా చదివిస్తానని.. ఆ బాధ్యతలు తాను తీసుకుంటానని ఈ డాషింగ్ బ్యాట్స్మన్ హామీ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని కాపాడేందుకు కృషి చేస్తున్న రెస్క్యూ టీమ్స్, మెడికల్ టీమ్స్, వాలంటీర్లకు సెహ్వాగ్ కృతజ్ఞతలు తెలిపాడు.
ఇక సెహ్వాగ్ మంచి మనసుకు అందరూ అభినందిస్తున్నారు. గతంలో కూడా సెహ్వాగ్ ఇలాంటి సహాయాలు ఎన్నో చేశాడు. నీలాంటి వ్యక్తి ఈ దేశానికి చాలా అవసరం అంటూ ఆయన అభిమానులు కొనియాడుతున్నారు. సెహ్వాగ్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు ఐపీఎల్ లో సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.
This image will haunt us for a long time.
In this hour of grief, the least I can do is to take care of education of children of those who lost their life in this tragic accident. I offer such children free education at Sehwag International School’s boarding facility ???????? pic.twitter.com/b9DAuWEoTy
— Virender Sehwag (@virendersehwag) June 4, 2023