Telangana: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల(జనవరి) 30 వరకు సెలవుల్ని పొడిగించినట్లు తెలంగాణ చీఫ్సెక్రటరీ ప్రకటించారు. కరోనా నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినట్లు తెలిపారు.


జనవరి తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ తేదీ నుంచే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్రాతిని కలిపేసుకుని ఈనెల 16 వరకు సెలవులు ఉండగా.. 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నెలాఖరు వరకు సెలవులు పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తోంది. ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్, మరో వైపు కరోనా పాజిటివ్ కేసులతో ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా ప్రభావం ముందుగా విద్యాసంస్థలపై పడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు నేటితో ముగియనున్నాయి. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థల సెలవులను పొడిగించింది.
కోవిడ్ దృష్ట్యా కొద్దిరోజులు ప్రత్యక్ష తరగతులు వద్దని ప్రభుత్వానికి ఆరోగ్య శాఖ సూచించినట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ బాట పట్టిన ప్రయివేటు విద్యా సంస్థలు బీటెక్, ఎంటెక్, ఫార్మసీ విద్యార్థులకు ఈనెల 22 వరకు ఆన్లైన్ పాఠాలు చెప్పాలని జేఎన్టీయూహెచ్ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో కరోనా మహమ్మారి చాలాకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనా.. మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. గత ఏడాది కరోనా విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. స్కూల్స్, కాలేజీలు మూత పడటంతో ఆన్లైన్ క్లాసులతో సరిపెట్టుకున్నారు విద్యార్థులు. ఇక తాజాగా రాష్ట్రంలో థర్డ్వేవ్ ముంచుకొస్తోంది.