Roja : పాదయాత్రల వల్ల బరువు తగ్గడం వల్ల మరేం ప్రయోజనం లేదు

NQ Staff - January 17, 2023 / 10:34 AM IST

Roja  : పాదయాత్రల వల్ల బరువు తగ్గడం వల్ల మరేం ప్రయోజనం లేదు

Roja  : Pతెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేయబోతున్న విషయం తెలిసిందే. మరో వైపు పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సిద్ధం అవుతున్నారు.

ఈ సమయంలో మంత్రి రోజా లోకేష్ యొక్క పాదయాత్ర, పవన్ కళ్యాణ్ యొక్క బస్సు యాత్ర పై మరో సారి విమర్శలు గుప్పించారు. విజయవాడ భవాని ద్వీపంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ముగింపు కార్యక్రమానికి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వారాహితో వచ్చినా.. నారా లోకేష్ యువగళంతో వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పాద యాత్రలు చేస్తే బరువు తగ్గుతారు తప్పితే ప్రజల యొక్క మద్దతు పొందరు అంటూ రోజా ఎద్దేవ చేశారు.

పాదయాత్రల వల్ల ప్రయోజనం ఉండదని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు మరోసారి జగనన్నకే పట్టం కడతారని రోజా ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై నమ్మకం ఉందని మరే ఇతర పార్టీలు కూడా చేయని సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్న కారణంగా ఇతర పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రోజా అన్నారు. పాదయాత్రలు బస్సు యాత్రలు అధికారాన్ని కట్టబెట్టవని రోజా మరోసారి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us