చెప్పుతో కొడతాను.. సుధీర్ పరువుదీసిన రష్మి

NQ Staff - October 25, 2020 / 06:36 PM IST

చెప్పుతో కొడతాను.. సుధీర్ పరువుదీసిన రష్మి

రష్మి సుధీర్ కాంబో బుల్లితెరపై ఎప్పటికీ చెరగనిది. వారిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఎప్పటికీ ఫ్రెష్‌గానే ఉంటుంది. గత ఏడేళ్లుగా రష్మి సుధీర్ జంట బుల్లితెరను ఏలేస్తోంది. స్పెషల్ ఈవెంట్ల ద్వారా రష్మి సుధీర్ మరింత ఫేమస్ అవుతుంటారు. కొన్ని ఈవెంట్లు ఏకంగా వీరినే మెయిన్ లీడ్‌గా పెట్టి వీరి చుట్టే మొత్తం కాన్సెప్ట్ తిరిగేలా ప్లాన్ చేస్తారు. అలా ఓ రెండు ఈవెంట్లలో వీరి పెళ్లిని చేసేశారు. అలా ఈ ఇద్దరి కెమిస్ట్రీ నేటికి స్పెషల్‌గానే ఉంటుంది.

RAshmi gautham

Rashmi Gautham

తాజాగా వీరిద్దరూ అక్కా ఎవరే అతగాడు ఈవెంట్‌లోనూ సందడి చేశారు. రంగమ్మ మంగమ్మ అనే పాటకు రష్మి అదిరిపోయే పర్ఫామెన్స్ చేయగా అందులోనూ స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. అలా ఇద్దరి కెమిస్ట్రీ పాటలోనూ బాగానే కుదిరింది. ఇక ఈ ఈవెంట్‌లో ఓ స్కిట్ వేశారు. రష్మి, వర్షిణిలను పెళ్లి చేసుకునేందుకు అందరూ పోటీ పడ్డారు. అందులో రష్మి కోసం సుధీర్ బాగానే పాకులాడుతాడు. పెళ్లి చేసుకోవాలనే కోరికను బయట పెడతాడు. అందులో భాగంగా భారీ డైలాగ్‌లు కొడతాడు.

RAshmi gautham Sudheer

RAshmi gautham Sudheer

నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకున్న అర్హతలేంటి అని సుధీర్‌ను రష్మి అడుగుతుంది. అందరిలా నేను మూడు ముళ్లు వేయను.. నలభై ముళ్లు వేస్తాను.. అందరిలో మూడు రాత్రులు కాదు.. మనదంతా అంటూ ఓ టైపులో చెబుతాడు. అలా అనేసరికి రష్మి అదిరిపోయే సెటైర్ వేసింది. అందరూ చేతితో కొడతారు.. కానీ నేను చెప్పుతో కొడతాను అంటూ సుధీర్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ఇలా స్కిట్ చివర్లో రష్మిని చేసుకోవాల్సింది ఉప్పల్ బాలుని సుధీర్ పెళ్లి చేసుకున్నాడు. అలా స్కిట్‌కు అదిరిపోయే క్లైమాక్స్ ఇచ్చారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us