Pawan Kalyan : ధర్మ పరిరక్షణ.. ప్రజాక్షేమం కోసం పవన్ కల్యాణ్ యాగం..!
NQ Staff - June 12, 2023 / 12:36 PM IST

Pawan Kalyan : పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల కోసం అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ ఆధ్యాత్మికత వైపు కూడా అడుగులు వేస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ లో ఈ రోజు ఉదయం 6.55 గంటలకు ఆయన యాగం ప్రారంభించాడు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలనే ఉద్దేశంతో పవన్ ఈ యాగం చేపట్టారు.

Pawan Kalyan Started Yagam At Janasena Party Office In Mangalagiri
ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటనలో వివరించింది. పార్టీ ఆఫీస్ లోని యాగశాల పరిఢవిల్లుతోంది. ఐదుగురు దేవతా మూర్తులను ప్రతిష్టించినట్టు పార్టీ వివరించింది.

Pawan Kalyan Started Yagam At Janasena Party Office In Mangalagiri
ఈ యాగం కోసం ఆదివారం సాయంత్రమే పవన్ కల్యాణ్ పార్టీ ఆఫీస్ కు చేరుకున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా రుత్వికుల సమక్షంలో యాగం జరుగుతంది.

Pawan Kalyan Started Yagam At Janasena Party Office In Mangalagiri
రాష్ట్ర ప్రజలు సంక్షేమంగా, ఆయురారోగ్యాలతో ఉండేందుకు ఈ యాగం చేస్తున్నట్టు పార్టీ వివరించింది. త్వరలోనే వారాహి యాత్రను పవన్ కల్యాణ్ ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే యాత్ర సక్సెస్ అయ్యేందుకు పవన్ ఈ యాత్రను చేపట్టినట్టు చెబుతున్నారు కొందరు జనసేన నేతలు.

Pawan Kalyan Started Yagam At Janasena Party Office In Mangalagiri
అటు రాష్ట్ర ప్రజలు సంక్షేమం కోసం, ఇటు పవన్ యాత్ర సక్సెస్ కోసం రెండు రకాలుగా ఈ యాగం ఫలితాన్ని ఇస్తుందని భావిస్తోంది జనసేన పార్టీ.

Pawan Kalyan Started Yagam At Janasena Party Office In Mangalagiri
పవన్ కల్యాణ్ మొదటి నుంచి హైందవతత్వాన్ని ఎక్కువగా ఆచరిస్తుంటారు. ఇందులో భాగంగానే యాగం చేస్తున్నారు.