PM Narendra Modi And Nara Chandrababu Naidu : వైరల్ అవుతున్న పీఎం మరియు ఏపీ మాజీ సీఎం ఫొటో.. రాజకీయ మార్పు రానుందా?
NQ Staff - December 6, 2022 / 11:50 AM IST
PM Narendra Modi And Nara Chandrababu Naidu : ఏపీలో తెలుగు దేశం పార్టీతో పొత్తులేనే లేదు అంటూ రాష్ట్ర బిజెపి నాయకులు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. కానీ జనసేన పార్టీ అధినేత, నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా కూడా 2014 తరహాలో మూడు పార్టీలు కలిసి పోటీ చేసే బాగుంటుంది అన్నట్లుగా ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మూడు పార్టీలు కలిస్తే కచ్చితంగా అధికార వైకాపాకు చెక్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే బీజేపీతో సాన్నిహిత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న వ్యాఖ్య.
ఆ విషయం పక్కన పెడితే తాజాగా అఖిలపక్ష సమావేశం కోసం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తో చంద్రబాబు నాయుడు కొన్ని నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆ సమయంలో రాజకీయాల గురించి చర్చ వచ్చిందా లేదా అనేది తెలియదు. కానీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.
మోడీతో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడి ఉంటారు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయమై చంద్రబాబు నాయుడు మోడీ మాట్లాడి ఉంటారా అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
ఒకవేళ వారిద్దరు కలిస్తే మాత్రం ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మలుపు తిరిగే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో మరియు రాజకీయ సర్కిల్స్ లో పెద్ద చర్చకి తెర లేపింది.