ఏపీ లో కొత్తగా 9544 కరోనా కేసులు
Admin - August 21, 2020 / 12:10 PM IST

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9544మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 91 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 334940కి చేరుకుంది.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 704
చిత్తూరులో 1103
ఈస్ట్ గోదావరిలో 1312
గుంటూరులో 358
కడపలో 343
కృష్ణాలో 265
కర్నూలులో 919
నెల్లూరులో 761
ప్రకాశంలో 797
శ్రీకాకుంలో 571
విశాఖపట్నంలో 738
విజయనగరం 542
వెస్ట్ గోదావరిలో 1131 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.