ఆ ఒక్క పనితో మొత్తం పొలిటికల్ సీన్ ను మార్చేసిన జగన్.. నోరు వెళ్లబెట్టిన బాబు
Tech Desk-2 - January 18, 2021 / 07:15 PM IST
రాజకీయ కుట్రతో జరిగిందో లేదా హిందు మతంపై మరో మతం కుట్రతో చేసిందో తెలియదు కాని హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. రామతీర్థం వంటి ప్రముఖ దేవాలయంలో శ్రీరాముడి విగ్రహంను ద్వంసం చేశారు. ఈ మొత్తం వ్యవహారం కు కారణం ప్రభుత్వ అసమర్థత మరియు హిందూ మతంపై చిన్న చూపు అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో జగన్ ప్రభుత్వం డైలమాలో పడ్డట్లయ్యింది. జనాలు కూడా జగన్ ప్రభుత్వంపై చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో జగన్ చేసిన పనితో మొత్తం సీన్ మారిపోయింది. జనాల్లో ఉన్న అభిప్రాయం పూర్తిగా మార్చేందుకు జగన్ చేసిన పని ఉపయోగపడింది. దానికి తోడు డీజేపీ సవాంగ్ చేసిన వ్యాఖ్యలు కూడా జగన్ కు మళ్లీ పూర్వ వైభవంను తీసుకు వచ్చింది.
దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో జగన్ ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. నువ్వు క్రిస్టియన్ అవ్వడం వల్లే ఇలా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులకు ప్రభుత్వమే కారణం అంటూ బీజేపీ మరియు టీడీపీ ఇతర పార్టీల నాయకులు ఆరోపించారు. ఇలాంటి సమయంలో జగన్ తాను హిందు మతంకు వ్యతిరేకం కాదని తాను హిందు మతంను కూడా ఆచరిస్తాను అంటూ చెప్పేందుకు ప్రయత్నించలేదు. జనాలు తాను చేసే పనులు చూసి అర్థం చేసుకునేలా చేశాడు. అందుకోసం జగన్ దాదాపుగా 50 దేవాలయాలను పునర్ నిర్మించేందుకు ఒకే సారి శంకుస్థాపన చేశారు. ఇలా ఏ సీఎం కూడా చేయలేదు. దాంతో హిందువుల్లో జగన్ ఇమేజ్ అలా పైకి వెళ్లింది.
ఇక దేవాలయాల పునర్ నిర్మాణం నిర్ణయం తర్వాత జగన్ తీసుకున్న నిర్ణయం గోపూజ. సంక్రాంతి సందర్బంగా రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో కూడా గోపూజ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. తాను స్వయంగా గో పూజలో పాల్గొన్నాడు. దాంతో జగన్ ను పూర్తిగా హిందు అనుకూలుడు అంటూ నమ్మేస్తున్నారు. గో పూజ కార్యక్రమం బాగా పని చేసింది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రజల్లో ఉన్న కోపం గో పూజతో పూర్తిగా తొలగి పోయింది అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి జగన్ మాస్టర్ మైండ్ తో అనూహ్యంగా సీన్ ను మార్చేసి టీడీపీ మరియు బీజేపీలను టార్గెట్ చేశాడు. జగన్ చేసిన ఈ పనిని బాబుతో పాటు ఇతర పార్టీ నాయకులు నోరు వెళ్లబెట్టి చూడటం తప్ప మరేం చేయలేని పరిస్థితి.