ఐపీల్ వచ్చేస్తుంది. ఎప్పుడంటే..!

Admin - July 24, 2020 / 10:21 AM IST

ఐపీల్ వచ్చేస్తుంది. ఎప్పుడంటే..!

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి జీవితం అయోమయంగా తయారయింది. ఇప్పటికే కరోనా వల్ల పెళ్లిళ్లు,విందులు,వినోదాలు అన్ని కూడా అడ్డకట్టు వేయాల్సి వచ్చింది. ఇక క్రికెట్ అభిమానులు మాత్రం తీవ్ర నిరుత్సాహంగా ఉన్నారు. ఈ ఏడాదిలో జరగవలసిన ఐపీల్ కోసం క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చేస్తున్నారు.కరోనా నేపథ్యంలో మన దేశంలో మ్యాచ్‌లను నిర్వహించలేని పరిస్థితులు నెలకొనడంతో యూఏఈ వేదికగా నిర్వహిస్తామని బీసీసీఐ ఇది వరకే ప్రకటించింది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఐపీఎల్ టోర్నీ ప్రారంభంపై అధికారిక ప్రకటన బయటకు వచ్చింది.అయితే సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకు ఐపీల్ టోర్నీలు జరుగుతాయని ఐపీల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా ప్రకటించారు. అలాగే ఎన్ని టీమ్స్ ఆడుతాయో, ఎంతమంది ఆటగాళ్లు ఆడుతారో త్వరలో వివరణ ఇవ్వనుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us