Himanshu Rao Kalvakuntla Made Post On Social Media : ప్రభుత్వ స్కూల్ కు హిమాన్షు చేయూత.. కార్పొరేట్ రేంజ్ లో వసతులు..!
NQ Staff - July 9, 2023 / 05:57 PM IST

Himanshu Rao Kalvakuntla Made Post On Social Media :
ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుంది.. ఇంతకు ముందు కార్పొరేట్ స్కూల్స్ రాకముందు అంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువును కొనసాగించేవారు.. కానీ రాను రాను ప్రభుత్వ పాఠశాలలో చదువు నాణ్యత తగ్గడం అలాగే విద్యార్థులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించడానికి ఇష్టపడడం లేదు.

Himanshu Rao Kalvakuntla Made Post On Social Media
దీంతో రోజు రోజుకూ ప్రభుత్వ పాఠశాలలు దీనావస్థకు చేరుకున్నాయి.. ప్రభుత్వాలు కూడా పిల్లలు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలను తీసేయాల్సి వస్తుంది. ఇలా ఇప్పటికే ఎన్నో స్కూల్స్ మూతబడ్డాయి.. అయితే మళ్ళీ పాఠశాలలకు మునుపటి స్థితిని తీసుకు రావడానికి కొంత మంది కృషి చేస్తున్నారు.

Himanshu Rao Kalvakuntla Made Post On Social Media
తెలుగు రాష్ట్రాలలోని ఇప్పటి ముఖ్యమంత్రులు కూడా ప్రభుత్వ స్కూల్స్ ను పునరుద్ధరించేందుకు పాటు పడుతున్నారు.. పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలను మళ్ళీ ఒక్కొక్కటిగా పునరుద్దీకరణ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు కేటీఆర్ కుమారుడు హిమాన్షు కల్వకుంట్ల సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు..

Himanshu Rao Kalvakuntla Made Post On Social Media
ఈయన తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. ”నేను CAS అధ్యక్షునిగా నా పాఠశాలలో సేకరించిన నిధులతో ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పునరుద్ధరించాను. దీనిని మన గౌరవనీయ విద్యా మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు జూలై 12న ప్రారంభించ బోతున్నారు..

Himanshu Rao Kalvakuntla Made Post On Social Media
ఈ ప్రాజెక్ట్ వెనుక కథను త్వరలో పంచుకుంటాను అంటూ ఇతడు చెప్పుకొచ్చాడు.. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
Renovated this govt primary school with the funds I raised in my school as the CAS president.
It is going to be inaugurated by our Hon’ble Education Minister @SabithaindraTRS Garu on the 12th of July????????
Would love to share the story behind this project soon! pic.twitter.com/sylJE3dUx0
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) July 9, 2023