ఏపీ లో ఈ రోజు రికార్డు స్థాయిలో కేసులు
Admin - July 30, 2020 / 01:38 PM IST

ఎపి లో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,167 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.అలాగే కరోనా బారిన పడి 68 మంది మరణించారు.దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,30,557 కి చేరుకుంది.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 954
చిత్తూరులో 509
ఈస్ట్ గోదావరిలో 1441
గుంటూరులో 946
కడపలో 753
కృష్ణలో 271
కర్నూలులో 1252
నెల్లూరులో 702
ప్రకాశంలో 318
శ్రీకాకుంలో 586
విశాఖపట్నంలో 1223
విజయనగరం 214
వెస్ట్ గోదావరిలో 998 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.