Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాం… దేశ వ్యాప్తంగా సోదాలే సోదాలు

NQ Staff - September 16, 2022 / 07:59 PM IST

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాం… దేశ వ్యాప్తంగా సోదాలే సోదాలు

Delhi Liquor Scam Case : దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా సోదాలు నిర్వహిస్తూ పలు కంపెనీలకు చెందిన అధినేతలను ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌

అధికారులు దేశంలోని 40 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అభిషేక్, ప్రేమ్ సాగర్ రావు, అరుణ్ రామచంద్ర పెళ్లై నివాసాల్లో ఈడీ సోదాలు జరిగినట్లుగా సమాచారం అందుతుంది.

హైదరాబాదులో పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగాయని మీడియాకు సమాచారం అందుతుంది. కేవలం హైదరాబాదులోనే 25 బృందాలుగా ఈడీ అధికారులు ఏర్పడి ఈ సోదాలు నిర్వహిస్తున్నారట.

ED Conducting Nationwide Investigations Delhi Liquor Scam Case

ED Conducting Nationwide Investigations Delhi Liquor Scam Case

నానక్‌ రామ్ గూడా రాబిన్ బిస్లరీ కార్యాలయం రాయదుర్గంలో సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్లలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అత్యంత కీలకమైన ఆధారాలు ఇప్పటికే లభించాయని.. వాటిని బేస్ చేసుకొని మరిన్ని ఆధారాల కోసం ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ఈడీ అధికారులు చెబుతున్నారు. మరో వైపు ఇందులో రాజకీయ కుట్ర కోణం ఉందంటూ కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేస్ ఎక్కడికి దారి తీస్తుందా అంటూ కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us