Air India : విమానంలో మహిళ ప్రయాణికురాలిపై తాగుబోతు మూత్ర విసర్జన

NQ Staff - January 4, 2023 / 03:51 PM IST

Air India : విమానంలో మహిళ ప్రయాణికురాలిపై తాగుబోతు మూత్ర విసర్జన

Air India : ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఒక ప్రయాణికుడు బాగా తాగి తన తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడట. ఈ సంఘటన గత ఏడాది నవంబర్‌ లో జరిగింది. నవంబర్‌ 26వ తారీకున జరిగిన ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత ప్రయాణికురాలు ఈ విషయమై ఇప్పటికే ఫిర్యాదు ఇచ్చినా స్పందన లేదట.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… న్యూయార్క్ నుండి న్యూ ఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ ఇండియా ఏఐ 102 విమానం లోని బిజినెస్ క్లాస్ లో ఒక వ్యక్తి లైట్స్ అన్నీ ఆర్పివేసి ఉన్న సమయంలో తోటి వృద్ద ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడట. ఈ విషయం ను ఆమె వెంటనే క్యాబిన్‌ క్రూకు చెప్పినా కూడా వారు పట్టించుకోలేదట.

ఎయిర్‌ ఇండియా విమానంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి టాటా గ్రూప్స్ చైర్‌ పర్సన్‌ చంద్రశేఖరన్ దృష్టికి తీసుకు వెళ్లిందట. క్యాబిన్ క్రూ స్పందించలేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రయాణికురాలికి జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన టాటా గ్రూప్‌ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సంస్థ పరమైన చర్యలు తీసుకోబోతున్నట్లుగా పేర్కొన్నారు. పోలీసుల విచారణ మొదలు అయ్యిందని కూడా టాటా గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us