ప్రగతి భవన్ లో జెండా ఎగురవేసిన సీఎం కెసిఆర్
Admin - August 15, 2020 / 07:25 AM IST
74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెరేడ్ గ్రౌండ్స్ లో ఉన్న అమరవీరుల సైనిక స్తూపం దగ్గర నివాళులు అర్పించారు. దేశానికి త్యాగం చేసిన మహానీయులను గుర్తు చేసుకున్నాడు. అనంతరం బేగంపేట లోని ప్రగతి భవన్ కు వెళ్లి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసు అధికారుల చేత గౌరవ వందనం స్వీకరించారు. అయితే ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్ శర్మ, డీజీపీ మహేందర్రెడ్డి మరియు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు తదితరులు పాల్గొన్నారు.