CM KCR నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తమ అభిమానాన్ని సరికొత్తగా, గొప్పగా చాటుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని హాలియా మునిసిపాలిటీ ప్రాంతంలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రంలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో సీఎం చిత్రాన్ని భారీఎత్తున రూపొందించారు. దాని పక్కనే ‘‘టీఆర్ఎస్ వెంటే నాగార్జునసాగర్’’ అని ఇంగ్లిష్ లో రాశారు. కేసీఆర్ కర్షకుల వెన్నంటి ఉండి ముందుకి నడిపిస్తున్నారనే అర్థం వచ్చేలా ఈ న్యాచురల్ బొమ్మను గీయించారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగంతో కలిసి దీనికి ప్లాన్ చేశారు. ట్రాక్టర్, ప్లౌ, కల్టివేటర్ల సాయంతో ఈ అద్భుతమైన చిత్రపటాన్ని ఆవిష్కరించారు. సంబంధిత మేకింగ్ వీడియోని కూడా విడుదల చేశారు.
అందరికీ అన్నం పెట్టే..
‘‘అందరికీ అన్నం పెట్టేది రైతు. ఆయనొక్కడు సల్లగా ఉంటే, రైతు లోకం క్షేమంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుంది’’ అంటూ కేసీఆర్ గతంలో ఒక మీటింగ్ లో ఇచ్చిన స్పీచ్ ని ఇందులో యాడ్ చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 60 వేల ఎకరాల ఆయకట్టుకి రెండు పంటలకీ నీరు అందుతోంది. నిర్మాణంలో ఉన్న కుంకుడు చెట్టు తండా ప్రాజెక్ట్.. నెల్లికల్ లిఫ్ట్ ప్రాజెక్ట్.. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే మరో 35 వేల ఎకరాలకి త్వరలో నీరు అందబోతోంది. కేవలం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే 97 వేల 3 వందల 11 మంది రైతుబంధు లబ్ధిదారులు ఉన్నారు’’ అని స్థానిక టీఆర్ఎస్ నాయకుడు చెప్పారు.
కుర్చీ వేసుకొని కూర్చుంటానన్న కేసీఆర్..
నెల్లికల్ లిఫ్ట్ ద్వారా 25 నుంచి 30 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నామని కేసీఆర్ గతంలో హాలియా మీటింగ్ లో ఇచ్చిన హామీని ఈ వీడియో ద్వారా మరోసారి గుర్తు చేశారు. పెద్ద దేవులపల్లెకి గోదావరి నీళ్లు తెచ్చి నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఒక్క ఎకరం కూడా బీడు లేకుండా కుర్చీ వేసుకొని కూర్చొని పని చేయించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్ ని జత చేశారు. ‘‘ఒకప్పుడు వ్యవసాయం చేస్తున్నా అని చెప్పుకోవటానికి సిగ్గుపడేవారు. దాన్ని మొత్తం రివర్స్ చేసి ‘ఎస్’ ఐయామ్ ఏ ఫార్మర్ ఇన్ తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి తీసుకురావాలె’’ అన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షనూ ఇందులో చూడొచ్చు.
గోదావరి జలాల విడుదల..
సీఎం కేసీఆర్ ఇవాళ మంగళవారం గజ్వేల్ కి సమీపంలోని అవుసులోనిపల్లి వద్ద కొండ పోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డి కాలువ ద్వారా గోదావరి జలాలను హల్దీ వాగు(మంజీరా నది)లోకి విడుదల చేశారు. దీంతో సిద్ధిపేట, మెదక్ జిల్లాల పరిధిలోని చెరువులు నిండనున్నాయి. తద్వారా 14 వేల ఎకరాలకి పైగా భూములకి సాగు నీరు అందనుంది.
100,000sft, Land Mural Gratitude to #CMKCR who stood behind farmer adding growth to his farming & honour to his living.
A wonderful hard work of young farmers of Haliya in collaboration with #TRS SM Team.#NagarjunaSagarWithTRS@KTRTRS @PRRTRS @korkantichander @BagathNomula pic.twitter.com/B7X32RjShY— Jagan Patimeedi (@JAGANTRS) April 5, 2021