కారులో ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి
Admin - August 7, 2020 / 09:50 AM IST
ఏపీలోని కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలు ఇంట్లో పార్క్ చేసిన కార్లో ఆడుకుంటున్న సమయంలో కారు డోర్ లాక్ పడింది. ఇక మూడు గంటల పాటు చిన్నారులు నరకయాతన పడ్డారు. అలా కార్లో చిక్కుకొని పోయిన ఆ ముగ్గురు పిల్లలు ఊపిరాడక మృతి చెందారు.
ముగ్గురు చిన్నారులు పర్వీన్, యాస్మిన్, హసీనా ఆ ముగ్గురి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు వారిని అప్పగించనున్నారు. దీనితో చిన్నారుల కుటుంబంలో తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయి.