Balakrishna :  తారకరత్న హెల్త్‌ విషయమై కీలక ప్రకటన చేసిన బాలకృష్ణ

NQ Staff - January 27, 2023 / 04:23 PM IST

Balakrishna :  తారకరత్న హెల్త్‌ విషయమై కీలక ప్రకటన చేసిన బాలకృష్ణ

Balakrishna  : లోకేష్ పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుప్పం వెళ్లిన నందమూరి హీరో తారకరత్న గుండె పోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే కుప్పంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.

మొదట పల్స్ ఆగి పోవడంతో తారకరత్న ఆరోగ్యం విషయమై ఆందోళన వ్యక్తం అయింది. ఆ తర్వాత ఆయనకు వైద్యుల చికిత్స ప్రారంభించిన తర్వాత పల్స్ మొదలైందట. తారకరత్న ఆరోగ్యం విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి తారకరత్న యొక్క హెల్త్ విషయమై కీలక ప్రకటన చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ తారకరత్నను బెంగళూరుకు తరలిస్తాం, అంబులెన్స్ లో గ్రీన్ ఛానల్ ద్వారా తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నాడు.

బెంగళూరుకు డాక్టర్ల సూచన మేరకు తరలిస్తున్నామని బాలకృష్ణ పేర్కొన్నారు. గుండెలో ఎడమ వైపు 90% బ్లాక్ అయిందని వైద్యులు తెలియజేశారు. మిగతా అన్ని రిపోర్టులు బాగున్నాయి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు తారకరత్న యొక్క ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు అని బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితమే బాబాయ్ బాలకృష్ణ కి ఫోన్ చేసి తారకరత్న యొక్క ఆరోగ్య పరిస్థితి ని గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us