ఏపీలో విజృంభిస్తున్న కరోనా. కొత్తగా 10,276 కేసులు
Admin - August 22, 2020 / 12:59 PM IST

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,276మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 97మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,45,216కి చేరుకుంది.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 1020
చిత్తూరులో 1220
ఈస్ట్ గోదావరిలో 1321
గుంటూరులో 719
కడపలో 539
కృష్ణాలో 232
కర్నూలులో 850
నెల్లూరులో 943
ప్రకాశంలో 693
శ్రీకాకుంలో 661
విశాఖపట్నంలో 540
విజయనగరం 505
వెస్ట్ గోదావరిలో 1033 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.