ఏపీ లో ఈ రోజు రికార్డు స్థాయిలో కేసులు & మరణాలు

Admin - July 29, 2020 / 01:28 PM IST

ఏపీ లో ఈ రోజు రికార్డు స్థాయిలో కేసులు & మరణాలు

ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నేడు అత్యధికంగా పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బుల్ టెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు 10,093మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది.అలాగే కరోనా బారిన పడి 65 మంది మరణించారు.దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,20,390 కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 1371
చిత్తూరులో 819
ఈస్ట్‌ గోదావరిలో 1676
గుంటూరులో 1124
కడపలో 734
కృష్ణలో 259
కర్నూలులో 1091
నెల్లూరులో 608
ప్రకాశంలో 242
శ్రీకాకుంలో 496
విశాఖపట్నంలో 841
విజయనగరం 53
వెస్ట్ గోదావరిలో 779 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us