Uppal : నాలుగు సంవత్సరాల తర్వాత ఉప్పల్ లో వన్డే మ్యాచ్
NQ Staff - January 11, 2023 / 11:30 PM IST

Uppal : హైదరాబాద్ వాసులకు మరోసారి క్రికెట్ పండుగను తీసుకు రాబోతున్నట్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధికారికంగా వెళ్లడించింది. ఈనెల 18న ఉప్పల్ స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు అజహరుద్దీన్ ప్రకటించారు.
ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు. ఈనెల 13 నుంచి ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు ప్రారంభం కాబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఆఫ్ లైన్ టికెట్లు అమ్మడం లేదని, ఆన్లైన్లో మాత్రమే టికెట్లు విక్రయిస్తామని ఆయన తెలిపారు.
ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాల్లో ఈ నెల 15 నుంచి 18 వరకు ఉదయం 10 నుంచి 3 గంటల వరకు ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు.
జనవరి 14న న్యూజిలాండ్ జట్టు నగరానికి వస్తుందని, 15న ప్రాక్టీసు ఉంటుందని వెల్లడించారు. భారత జట్టు 16న హైదరాబాద్ చేరుకుంటుందన్నారు. ఈ మ్యాచ్ కు భారీ ఎత్తున క్రికెట్ అభిమానులు హాజరు అయ్యే అవకాశం ఉంది.