Telangana New Secretariat : కొత్త సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం..!
NQ Staff - February 3, 2023 / 08:19 AM IST

Telangana New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామునుంచే భారీగా అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. సచివాలయంలో వుడ్ వర్క్స్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. కాగా అధికారులు, పోలీసులు దాదాపు 11 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
భారీగా మంటలు చెలరేగడంతో గుమ్మటం నిండా పొగలు అలుముకున్నాయి. ఈ నెల 17వ తేదీన కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే భారీగా అగ్ని ప్రమాదం జరగడానిక గల కారణాలను అధికారులు, నిర్మాణ సంస్థ ఆరా తీస్తున్నారు.
రీసెంట్ గానే మంత్రి వేముల ప్రశాంత్ సచివాలయాన్ని పరిశీలించి పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే ఈ మంటలు చెలరేగడంతో పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. కాగా ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.