Manchu Vishnu : ‘జిన్నా’పై దుష్ప్రచారం: యూ ట్యూబ్ ఛానల్స్ వివరాలు వెల్లడించిన మంచు విష్ణు
NQ Staff - October 20, 2022 / 03:26 PM IST

Manchu Vishnu : మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన ‘జిన్నా’ సినిమా రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. తన సినిమాపై విడుదలకు ముందే దుష్ప్రచారం మొదలవుతుందంటూ సినిమా ప్రమోషన్ల సందర్భంగా న్యూస్ క్యూబ్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంచు విష్ణు చెప్పారు.
మంచు విష్ణు ఊహించినట్లే ఆయా యూ ట్యూబ్ ఛానళ్ళలో సినిమా పట్ల నెగెటివిటీ ప్రచారం మొదలైపోయింది. మంచు విష్ణు తాజాగా ఆయా ఛానళ్ళ వివరాల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
పెయిడ్ బ్యాచ్..
ఆయా యూ ట్యూబ్ ఛానళ్ళని పెయిడ్ బ్యాచ్గా తాను అభివర్ణిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నాడు మంచు విష్ణు. ఇంత ద్వేషం ఎందుకు.? ఆయా ఛానళ్ళను త్వరలోనే మూయించేస్తానని వాళ్ళు తెలుసుకుంటే మంచిదని కూడా విష్ణు తన ట్వీట్లో పేర్కొనడం గమనార్హం.
‘జిన్నా’ సినిమాలో మంచు విష్ణు సరసన సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ హీరోయిన్లుగా నటించిన విషయం విదితమే. సినిమాపై మంచు విష్ణు చాలా కాన్ఫిడెంట్గా వున్నాడు. మంచి సినిమా తీశామనీ, మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నామని మంచు విష్ణు సహా ‘జిన్నా’ టీమ్ చెబుతోంది.
As expected. I am calling out the ‘paid batch’. GINNA hasn’t released and these guys have started giving negative reviews. Why so much hatred???? ?. I hope they realize that we will shut their channels down soon. pic.twitter.com/6FJ1xV4vaj
— Vishnu Manchu (@iVishnuManchu) October 20, 2022