Sai Pallavi : సాయి పల్లవి సమాధానాన్ని దాటవేసిందెందుకబ్బా.!
NQ Staff - June 16, 2022 / 10:33 PM IST
Sai Pallavi : సాయి పల్లవి మీద హైద్రాబాద్లో పోలీస్ కేసు నమోదయ్యింది. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ తరఫున ఓ వ్యక్తి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘గో సంరక్షకులపై’ ‘ఉగ్రవాద వ్యాఖ్యలు’ సాయి పల్లవి చేసిందనేది ప్రధాన ఆరోపణ.
‘విరాటపర్వం’ సినిమా ప్రమోషనల్ ఇంటర్యూలో మాట్లాడుతూ, కాశ్మీర్లో హిందూ పండిట్లపై తీవ్రవాదులు జరిపిన దాడుల్ని, గో సంరక్షకులు ఓ ముస్లిం డ్రైవర్పై జరిపిన దాడితో పోల్చుతూ, మతం పేరుతో హింస, ఉగ్రవాదం మంచివి కావని సాయి పల్లవి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి మీద కేసు నమోదు కాగా, తాజాగా మీడియా ప్రతినిథి ఒకరు, సాయి పల్లవిని ఈ కేసు విషయమై ప్రశ్నించడం జరిగింది.
రానా ఎందుకు అడ్డుకున్నాడబ్బా.?
‘మీరు నా మంచి గురించి ఆలోచించే మంచి ప్రశ్న వేశారు..’ అని సాయి పల్లవి సమాధానం చెప్పేలోపు, రానా మైక్ అందుకున్నాడు. ఇది చాలా చిన్న వేదిక అనీ, వన్ టూ వన్ సమాధానాలు చెప్పే సందర్భమనీ, పెద్ద వేదికపై సాయి పల్లవి ఆ విషయంపై స్పందిస్తుందని రానా చెప్పాడు.
నిజానికి, వేదిక చిన్నదైనా పెద్దదైనా.. విషయం వివాదాస్పదమవుతున్నప్పుడు స్పందించడమే బెటర్. తన ఉద్దేశ్యం అది కాదని చెప్పడమో, లేదంటే తన వ్యాఖ్యల్ని సమర్థించుకోవడమో సాయి పల్లవి చేసి వుంటే బావుండేది.
రేపు ‘విరాటపర్వం’ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, విషయం లైవ్లో వుండాలని ఇదంతా చేస్తున్నారని అనుకోవాలేమోనని సాయిపల్లవిపైనా రానా పైనా కొందరు మండిపడుతున్నారు సోషల్ మీడియా వేదికగా.