Mahesh: మహేష్- ప్రశాంత్ నీల్ కాంబో ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసా?
Samsthi 2210 - June 14, 2021 / 03:28 PM IST
Mahesh: కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా మారిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన తెరకెక్కించిన కేజీఎఫ్ సీక్వెల్ త్వరలో విడుదల కానుండగా, ఈ సినిమా హిట్టైతే ప్రశాంత్ క్రేజ్ పీక్స్లోకి వెళ్లడం ఖాయం. అయితే ఈ కన్నడ దర్శకుడు తన తర్వాతి ప్రాజెక్టులన్ని తెలుగు హీరోలతో చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమా చేస్తుండగా, ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్గా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు.
సలార్ తర్వాత ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్తో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రంకి సంబంధించి ఇప్పటికే అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. ఇక రామ్ చరణ్ హీరోగా కూడా ప్రశాంత్ నీల్ సినిమా చేయనున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావలసి ఉంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు- ప్రశాంత్ నీల్ కంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ ఇప్పటికే మహేష్ని సంప్రదించగా, ఆయన సున్నితంగా నో చెప్పాడనే టాక్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే మొన్నటివరకు కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో మహేష్ బాబు పలువురు దర్శకులు కథలు విన్నాడు. ప్రశాంత్ నీల్ కూడా స్క్రిప్ట్ తీసుకొని వచ్చాడట. అలాగే నేరేషన్ ఇచ్చిన తర్వాత మహేష్ ఎందుకో స్టోరీ కనెక్ట్ కాలేదని అనిపించి నో చెప్పేసాడని టాక్.
మహేష్కి చెప్పిన కథని తీసుకొని ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిన ప్రశాంత్ నీల్ అక్కడ సక్సెస్ సాధించాడు. త్వరలో ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబోలో సినిమా రూపొందనుంది. అయితే ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్లో మహేష్ దగ్గర ఏం మిస్ అయింది.. ఎన్టీఆర్ దగ్గర ఏం ప్లస్ అయింది..? అంటూ సోషల్ మీడియాలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కొందరు ఏమంటున్నారంటే హై యాక్షన్ సీక్వెన్స్ తో మాస్ కథని సిద్ధం చేసి ఉంటాడని, అందుకే అది మహేష్కి నచ్చలేదేమో అని పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతేనేం మొత్తానికి ఈ కాంబినేషన్ సెట్ కాలేదని ఫ్యాన్స్ అయితే కాస్త నిరాశగానే ఉన్నారు.