Pragya Jaiswal టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ తమిళ, కన్నడం, హిందీ పరిశ్రమలో పాగా వేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తుంది. అయితే అవి పెద్దగా వర్కవుట్ కావడం లేదు. దీంతో అందాల ఆరబోతను నమ్ముకుంది. వీలున్నప్పుడల్లా ఎద అందాల కంచెను తెంపుతూ హీటెక్కిస్తుంటుంది. తాజాగా కైపెక్కించే చూపులు చూస్తూ గ్లామర్ షో చేసిన ప్రగ్యా.. యూత్కు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.
ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. బాలకృష్ణ, బోయపాటి శీను సినిమాలో ఓ హీరోయిన్గా నటిస్తుండగా, మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న సన్ ఆఫ్ ఇండియాలోను నటిస్తుంది. హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ఆంటీమ్లో నటించే అవకాశం కూడా అందుకున్నట్టు సమాచారం. ప్రగ్యా జోరు చూస్తుంటే సెకండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటడం ఖాయం అనే అనుమానం కలుగుతుంది.