Mahesh Babu తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మోస్ట్ లవబుల్ కపుల్స్లో మహేష్ బాబు– నమ్రత జంట ఒకటి. పెళ్లై చాన్నాళ్ళే అవుతున్నప్పటికీ ఇప్పటికీ వీరి మధ్య ప్రేమ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒకరి పై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ, పిల్లల ఆలనాపాలన చూసుకుంటూ వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతూ వస్తున్నారు. మహేష్ – నమ్రత దంపతులకు గౌతమ్, సితార అనే ఇద్దరు చిన్నారులు ఉండగా వీరు కూడా చాలా ఫేమస్. సోషల్ మీడియాలో చిన్నారులకు సంబంధించిన ఏ పోస్ట్ పెట్టిన కొద్ది క్షణాలలోనే వైరల్ అవుతుంది.
నమ్రతని మహేష్ ప్రేమ పెళ్లి చేసుకోగా, వీరిద్దరి మధ్య బాండింగ్ చాలా స్వచ్చంగా ఉంటుంది. తన శ్రీమతికి సంబంధించిన ఏ అకేషన్ని అయిన మహేష్ గ్రాండ్గా ప్లాన్ చేస్తుంటారు. ఈ రోజు నమ్రత 49వ పడిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఆమె బర్త్డే వేడుకను దుబాయ్లో గ్రాండ్గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. నమ్రత సోదరి కూడా అక్కడే ఉండడంతో వారితో కలిసి సెలబ్రేషన్స్ జరపనున్నట్టు సమాచారం. తాజాగా తన శ్రీమతికి మహేష్ స్వీట్ విషెస్ చెప్పగా, ఈ పోస్ట్ వైరల్ అయింది.
తన భాగస్వామితో ఏదో సందర్భంలో ముచ్చటిస్తున్న ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసిన మహేష్ స్వీట్ విషెస్ అందించారు. ఈ రోజు నేను ఎంతో ఇష్టపడే వ్యక్తి పుట్టిన రోజు. ప్రతి రోజు నీతో గడపడం ప్రత్యేకం అయినప్పటికీ, ఈ రోజు మరింత ప్రత్యేకం. అద్భుతమైన స్త్రీతో అందమైన పుట్టిన రోజు . లేడీబాస్కు ప్రత్యేక పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తన ట్వీట్లో పేర్కొన్నాడు. మహేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. కాగా, మహేష్ గత ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులని అలరించగా, ప్రస్తుతం సర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. దుబాయ్లో తొలి షెడ్యూల్ ప్లాన్ చేస్తుండగా, ఆ తర్వాత హైదరాబాద్ లో మిగతా సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
Someone I love was born today! ❤️ Everyday with you is special but today is a little more!! Celebrating my amazing woman. Happy birthday, boss lady ♥️♥️ pic.twitter.com/gDQ3hHVvSt
— Mahesh Babu (@urstrulyMahesh) January 21, 2021