Radhe Shyam: రాధే శ్యామ్ కోసం భారీ వీఎఫ్ఎక్స్.. క్రిస్మ‌స్‌కు మూవీని విడుద‌ల చేస్తార‌ని టాక్

Priyanka - May 5, 2021 / 03:31 PM IST

Radhe Shyam: రాధే శ్యామ్ కోసం భారీ వీఎఫ్ఎక్స్.. క్రిస్మ‌స్‌కు మూవీని విడుద‌ల చేస్తార‌ని టాక్

Radhe Shyam సాహో చిత్రం త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం రాధే శ్యామ్. రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఏకంగా ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమాను జూలై 30న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కాని క‌రోనా వ‌ల‌న కొన్నాళ్లు వాయిదా ప‌డే అవ‌కాశం క‌నిపిస్తుంది.

రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ కొద్ది భాగం మిగిలి ఉండ‌గా, ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇటలీ నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ప్ర‌స్తుత క‌రోనా నేప‌థ్యంలో అక్క‌డి ప‌రిస్థితుల‌ని వీఎఫ్ఎక్స్‌లో మేనేజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. వీఎఫ్ఎక్స్‌లో సీన్స్ క్రియేట్ చేయాలంటే చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని, ఈ క్ర‌మంలో మూవీ ద‌స‌రాకు లేదంటే క్రిస్మ‌స్‌కు రిలీజ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.పీరియాడిక‌ల్ మూవీగా రాధేశ్యామ్ చిత్రం తెర‌కెక్క‌గా, ఇటీవ‌ల చిత్ర గ్లింప్స్ ఒక‌టి విడుద‌లైంది. ఈ మోషన్ పోస్టర్ టీజర్ కే 20 మిలియన్ వ్యూస్ రాగా, దీంతోచ‌ఇండియా లోనే మరో యూనిక్ ఫీట్ ను ప్రభాస్ ట‌చ్ చేశాడు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us