ANASUYA: ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ .. వైరల్గా మారిన పిక్స్
Priyanka - May 16, 2021 / 10:16 AM IST
అందాల ముద్దుగుమ్మ అనసూయ తాజాగా తన బర్త్డేని ఫ్యామిలీతో కలిసి సరదాగా సెలబ్రేట్ చేసుకుంది. కరోనా వలన ఇంటి సభ్యుల మధ్యే కేక్ కట్ చేసి తెగ ఎంజాయ్ చేసింది. ఇక అనసూయ భర్త, పిల్లలు కూడా బర్త్ డే పార్టీలో రచ్చ చేశారు. వీరి గెటప్స్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. రీసెంట్గా థ్యాంక్ యూ బ్రదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ ప్రస్తుతం కరోనా వలన ఇంటికే పరిమితం అయింది. కరోనా తర్వాత ఖిలాడి , పుష్ప, రంగమార్తాండ చిత్రాలలో నటించనుంది.
అనసూయ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తుంది. తన ప్రేమ స్టోరీని బయోపిక్గా తీసేందుకు ఉత్సాహం చూపిస్తుంది. పిల్లల్ని కనడం వరకే.. దేవుడే పంచేస్తారు. నెక్స్ట్ టైం పాపని కనాలని ఉంది. ఆడబిడ్డను కనడం పెంచడం పెద్ద ఛాలెంజ్. కానీ నాకు కూతురు కావాలి. కూతుర్ని కనేటప్పుడు చాలా వరకూ నా వర్క్ని తనకోసం డెడికేట్ చేస్తా. దానికి కొంతటైం పడుతుంది. ప్రస్తుతం నా వయసు 35 ఏళ్లు.. 40 ఏళ్లకి కూతుర్ని కనడానికి ట్రై చేస్తా అని ఇటీవల చెప్పుకొచ్చింది అనసూయ.