Akkineni Nagarjuna Amala : కొడుకుల కోసం నాగార్జున దంపతులు తిరుమల యాత్ర

NQ Staff - April 26, 2023 / 07:51 PM IST

Akkineni Nagarjuna Amala : కొడుకుల కోసం నాగార్జున దంపతులు తిరుమల యాత్ర

Akkineni Nagarjuna Amala  : అక్కినేని నాగార్జున దంపతులు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేందుకు ఉన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ నాగ్‌ దంపతులు తమ పిల్లల భవిష్యత్తు పట్ల ఆనందంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇద్దరు కూడా సినిమాలతో బిజీగా ఉండటం సంతోషం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.

అఖిల్ ఏజెంట్‌ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను దాదాపుగా రూ.80 కోట్ల బడ్జెట్‌ తో అనిల్ సుంకర నిర్మించాడు. ఈ సినిమా కు భారీగానే ప్రీ రిలీజ్‌ బిజినెస్ అయ్యింది. మరి ఆ స్థాయిలో ఈ సినిమా వసూళ్లు సాధిస్తుందా అనేది ఆసక్తిగా మారింది.

ఇక నాగ చైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. తప్పకుండా అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టుకుంటుందని వారు చెబుతున్నారు.

ఇద్దరు కొడుకుల సినిమాలు త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో నాగార్జున తిరుమలలో స్వామి వారిని దర్శించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. కొడుకుల సినిమాలు సక్సెస్ కోసం నాగార్జున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లుగా అక్కినేని ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి నాగ్‌ కొడుకులకు ఈసారి అయినా కమర్షియల్‌ సక్సెస్ లు దక్కేనా చూడాలి.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us