Diwali : దీపావళి రోజున ఇది వండుకుని తింటే సంపద, ఆరోగ్యం సిద్ధిస్తాయి..ఏమిటది?

NQ Staff - October 23, 2022 / 07:15 AM IST

Diwali : దీపావళి రోజున ఇది వండుకుని తింటే సంపద, ఆరోగ్యం సిద్ధిస్తాయి..ఏమిటది?

Diwali : ఒక్కో పండుగకి ఒక్కోరకమైన ప్రత్యేకత ఉంటుంది. ఈ పండుగకి ఇలా సంప్రదాయంగా పూజలు చేయాలి.. ఇలాంటి ట్రెడిషన్ పాటించాలి అని శాస్త్రాలు చెబుతాయి. అలాగే దీపాల పండుగ దీపావళికి కూడా ప్రత్యేకత ఉంది.

దీపావళికి కంద దుంపతో వండిన వంటకాలు తినాలని చెబుతారు. ఇలా తినడం వల్ల వారికి సంపద కలిసొస్తుందని నమ్మకం. అలాగే కంద వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వెలుగుల పండుగ రోజు స్వీట్లు తినడానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో కంద దుంపతో తినే వంటకాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. వారణాసిలో కచ్చితంగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. కంద దుంపతో కూర వండుకుని తింటారు. లేదా పులుసు పెట్టుకుంటారు. పూరీతోపాటూ ఈ కూరను తింటారు.

వారణాసిలో కాయస్త్ అని పిలిచే తెగ వారు నివసిస్తారు. వారు కచ్చితంగా పాటించే నియమం ఇది. దీపావళి రోజున ఈ కూర చేయడం శుభప్రదమని చెబుతారు. అలాగే, ఈ కూరగాయను మీ ఇంట్లో పెంచడం వల్ల కుటుంబానికి సంపద, సంతోషం కలుగుతుందని అంటారు. ఇంట్లో పెంచిన కందను దీపావళి రోజున బయటకు తీసి వండాలని నమ్ముతారు.

ఏనుగు పాదంలా…

కంద దుంపను ‘ఎలిఫేంట్ ఫుట్’ అని పిలుస్తారు. ఆ దుంపను నిశితంగా పరిశీలిస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కంద దుంపలను నేల నుంచి బయటికి తీసేటప్పుడు చిన్న ముక్క భూమిలో ఉండిపోయినా అది మరో దుంపగా పెరుగుతుంది. ఈ దుంప ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. దీన్ని లక్ష్మీ పూజలో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని అంటారు.

ఆరోగ్యానికి ఎంతో మేలు…

దీపావళి రోజు కచ్చితంగా తినమని చెప్పే కందదుంప తినమనడంలో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. ఇది తినడం వల్ల శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గుతుంది. ఈ కూరగాయలో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే దీన్ని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కందలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. ఇది తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో పైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

ఎలా వండాలి

కంద చూడగానే నోరూరించేలా ఉండదు. అందుకే దీనితో ఏం వండుకోవాలో చాలా మందికి తెలియదు. కంద దుంపతో పులుసు కూర వండుకుని తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చిన్న ముక్కలుగా తరుక్కుని వేపుడు చేసుకోవాలి. దీని రుచి అదిరిపోతుంది. అలాగే దీంతో కొన్ని ప్రాంతాల్లో పచ్చడి కూడా చేస్తారు. కందకు బెస్ట్ జోడీ పూరీ. బంగాళాదుంపకు బదులు కంద కూర తింటే చాలా బావుంటుంది.

Read Today's Latest Diwali 2022 in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us