Vijayasai Reddy : ‘బొల్లిబాబూ..’ అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ట్వీటాస్త్రాలు.!
NQ Staff - July 9, 2022 / 09:38 AM IST
Vijayasai Reddy : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ర్యాగింగ్ చేసే క్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయరెడ్డి, మాటల మీద అదుపు కోల్పోతుండడం తెలిసిన విషయమే. అయినాగానీ, విజయసాయిరెడ్డి ట్వీట్ల పరంపరలో ‘స్టఫ్’ ఏమాత్రం తగ్గడంలేదు.
తాజాగా, ‘బొల్లిబాబూ..’ అంటూ విజయసాయిరెడ్డి వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ‘బొల్లి బాబూ…ప్లీనరీ మొదలవడంతోనే నెత్తురు కక్కుకుంటున్నావు. ఆదివారం వరకు ఉంటావో పోతావో? ‘మన’ డాక్టర్లని పిలిపించుకో. మెదడులో ఫ్యూజులు ఎలాగూ పోయాయి. గుండెనైనా కాపాడుకో. నీ తండ్రిని ప్రేమతో నాన్నా అని పిలవగా ఎవరూ చూడలేదు. ఎందుకు మెంటల్ నాయుడు కుటుంబబంధాల గురించి మాట్లాడతావు?..’ అంటూ ట్వీటేశారు విజయసాయిరెడ్డి.
స్మార్ట్ రింగ్ మీద సైతం విజయసాయిరెడ్డి ట్వీటాస్త్రం.!
ఇదిలా వుంటే, తన చేతికి స్మార్ట్ రింగ్ ధరించి, దాని ప్రాముఖ్యతను ఇటీవల చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు వివరించిన విషయం విదితమే. ఆ రింగ్ మీద ఇప్పటికే ఓ ట్వీటేసిన విజయసాయిరెడ్డికి టీడీపీ శ్రేణుల నుంచి కౌంటర్ ఎటాక్ పడింది.
దాంతో, విజయసాయిరెడ్డి ఇంకో ట్వీటేశారు. ‘పది వేలు కూడా చేయని స్మార్ట్ రింగును ‘షో’ చేసి ఎంత బిల్డప్ ఇచ్చావు చిప్ దొబ్బిన బాబూ! బ్రెయిన్లో మెయిన్ చిప్ పోయాక చూపుడు వేలు రింగులో ఏ ‘చిప్ప’ ఉంటేనేం. సెల్ ఫోన్ కనిపెట్టింది నేనేనని చెప్పావే! ఇదీ అలాగే ఉంది. వాటర్ ప్రూఫ్ అంట కదా. అందుకే ఎడమ చేతికి ధైర్యంగా పెట్టుకున్నావు!’