వైఎస్ జగన్ బర్త్డే.. చిరంజీవి, మహేష్ బాబు స్పెషల్ గ్రీటింగ్స్
Samsthi 2210 - December 21, 2020 / 02:22 PM IST
ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే కావడంతో ఆయనకు సినీ, క్రీడా,రాజకీయ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు అందుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు, తెలంగాణ మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు జగన్కు తమ ట్విట్టర్ ద్వారా బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు
చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా జగన్కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. ‘ డైనమిక్ యువ నాయకుడు వైఎస్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకున్న సంకల్పం గొప్పది. లక్ష్యాలను గ్రహించడం కోసం మీలో ఉన్న పట్టుదల ప్రశంసనీయం. మీ భవిష్యత్ మరింత అందంగా మారాలని , రానున్న రోజులలో ప్రజలకు మరిన్ని సాయాలు చేయాలని కోరుకుంటున్నా అని చిరు ట్విట్టర్ లో తెలిపారు. ఇక మహేష్ బాబు.. ‘ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ విజన్ మరియు కృషితో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి వైపు నడిపించాలని, మీరు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు మహేష్ ట్వీట్ చేశారు
చిరంజీవి, మహేష్ లకు జగన్తో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయ్యాక చిరంజీవి తన సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్ళి సన్మానించి వచ్చారు. అలానే తాను నటించిన సైరా నర్సింహారెడ్డి సినిమా చూడాలని జగన్ను కోరారు చిరు. మంచు విష్ణు, నిర్మాత బండ్ల గణేష్ జగన్కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇదాలా ఉంటే జగన్ బర్త్ డే సందర్భంగా ఏపీలో వైసీపీ శ్రేణులు హంగామా చేస్తున్నారు. జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతూ, ఎక్కడికక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.